Maanaadu : రీమేక్ రానా

రానా దగ్గుబాటి, టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చినా, తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో పాత్రలే కాదు, కథ నచ్చితే విలన్ పాత్రలోనూ జీవించేస్తాడు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో రానా స్టామినా అందరికీ తెలిసింది.

ఈ సినిమా తర్వాత రానా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మలయాళంలో వచ్చిన అయ్యప్పన్ కోశియమ్ తెలుగు రీమేక్. ఈ సినిమాలో రానా మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి, మెప్పించాడు. దీంతో పాటు ఈ మధ్య సాయి పల్లవి, రానా కాంబోలో విరాట పర్వం వచ్చింది. ఈ సినిమాతో విలక్షణ పాత్రలను కూడా చేసే సత్తా ఉందని నిరూపించకున్నాడు.

ఇదిలా ఉండగా, రానా మరోసారి ఛాలెంజింగ్ రోల్ చేయడానికి రెడీ అయిపోయాడు. కోలీవుడ్ లో శింబు, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో మానాడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. టైమ్ లూప్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

- Advertisement -

అయితే, తాజా గా మానాడు సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. రానా దగ్గుబాటి మెయిన్ రోల్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఈ సినిమాలో హీరో పాత్రకు రానా వందకు వంద శాతం న్యాయం చేస్తాడని చెప్పచ్చు. ఎందుకంటే, రానా ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాడు. మంచి మార్కులు కొట్టేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు