Ramayanam : లీక్స్ పై డైరెక్టర్ అప్సెట్… నితీష్ కీలక నిర్ణయం

Ramayanam : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న హిందీ రామాయణం మూవీపై రోజుకో వార్త నెట్టింట ప్రత్యక్షమవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను సైలెంట్ గా స్టార్ట్ చేశారు మేకర్స్. షూటింగ్ లో మొదటి రెండు రోజులు మేకర్స్ కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాయి. సెట్స్ నుంచి పలు వీడియోలు, ఫోటోలు లీక్ అవ్వడం పట్ల డైరెక్టర్ నితీష్ తివారి అప్సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ లీక్స్ విషయంలో ఆయన ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం.

రామాయణం లీక్స్ తో అప్సెట్… అందుకే…

రామాయణం మూవీ సెట్స్ లోని పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గురువారం అర్ధరాత్రి నుంచి దశరధుడిగా నటిస్తున్న అరుణ్ గోవిల్, కైకేయి గా లారా దత్త లుక్స్ సోషల్ మీడియాలో రివీల్ అయ్యాయి. అరుణ్ గోవిల్ పొడవాటి గడ్డం, జుట్టుతో ఉండడంతో ఆయనను గుర్తించడం కాస్త కష్టమే అయ్యింది జనాలకి. అయినప్పటికీ ఇలా సినిమాలోని కీలక పాత్రధారులకు సంబంధించిన లుక్స్ లీక్ అవ్వడంతో డైరెక్టర్ నితీష్ తివారి అప్సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

రామాయణం సెట్స్ లో ఫోన్ బ్యాన్

ఇప్పటి నుంచి సెట్ లో ఉండే చిత్ర బృందం విషయంలో మేకర్స్ కఠినంగా వ్యవహరించబోతున్నారు. సెట్స్ లోకి ఏ ఒక్కరు కూడా ఫోన్లు తీసుకురాకూడదని కఠినమైన రూల్ ను పెట్టారట. దీనికి సంబంధించి ఇప్పటికే కెమెరా మెన్, అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పాటు చిత్ర బృందానికి ఆదేశాలు జారీ చేశారట. అంతేకాకుండా సెట్ లోని స్టార్స్ లుక్స్ ఎలా లీక్ అయ్యాయి అంటూ ఫైర్ అయ్యారట డైరెక్టర్ నితీష్ తివారి. ఇకపై రణబీర్ కపూర్ లుక్ లీక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారట చిత్ర బృందానికి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ ను లీక్ కాకుండా చూసుకోవడానికి సెట్లో ఫోన్ వాడకూడదని కఠినమైన నిర్ణయాన్ని అమలు చేశారట నితీష్ తివారి. అలాగే ఈ లీక్స్ ఎఫెక్ట్ కారణంగా మూవీ షూటింగ్ ప్రారంభం కాగానే సెట్ లో ఎక్స్ట్రా సిబ్బంది ఎవ్వరూ ఉండకూడదని ఆదేశించారట. నటీనటులు టెక్నీషియన్స్ మాత్రమే సెట్ లో ఉంటారన్నమాట.

- Advertisement -

రణబీర్ బాడీ డబుల్…

అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణం మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నితీష్ తివారి. ప్రస్తుతానికి రణబీర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం. అయితే ఈ మూవీలో రణబీర్ బాడీ డబుల్ ని టీం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామాయణం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో నితీష్ తివారి ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కేజిఎఫ్ స్టార్ యష్ ఈ మూవీలో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కాస్టింగ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆస్కార్ విజేత, హాలీవుడ్ లెజెండ్ మ్యూజిక్ కంపోజర్ హన్స్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నారని వార్తలు వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు