Ram Charan: గ్లోబల్ స్టార్‌కి అరుదైన అవకాశం…

2022 లో రిలీజ్ అయిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, ఆలియా భట్ నటించారు. ఈ సినిమా వచ్చి సంవత్సరం దాటినా సరే దీని క్రేజ్ ప్రేక్షకుల్లో ఇంకా తగ్గలేదు. ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.

తాజాగా సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది భారతీయ చలనచిత్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. అలాగే ఈ సినిమా హీరోలు రామ్ చరణ్, తారక్ కు గుర్తింపు కూడా ప్రపంచ స్థాయిలో వచ్చింది. మెగా పవర్ స్టార్ ను కాస్త గ్లోబల్ స్టార్ ని చేసింది.

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ లో ఇండియా టుడే కాంక్లేవ్ ప్రోగ్రామ్ జరగబోతుంది. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగబోతుంది. ఇందులో ఇండియాలోని దిగ్గజ వ్యక్తులు, నటీనటులు ఈ వేదిక పై మాట్లాడబోతున్నారు. ఈ వేదికగాపై రామ్ చరణ్ కు మాట్లాడే అవకాశం లభించింది.

- Advertisement -

RRR మూవీకి గ్లోబల్ స్థాయిలో వచ్చిన సక్సెస్, ఆస్కార్స్ వెళ్లడం, దాన్ని గెలుచుకోవడం వంటి అంశాలను రామ్ చరణ్ ఈ వేదికపై మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. కాగా, రామ్ చరణ్ స్పీచ్.. ఆ ప్రోగ్రాం చీఫ్ గెస్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముందు ఉంటుంది. దీనికి సంబంధించిన జాబితాను ఇండియా టూడే ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం.. గెస్ట్ లు అందరూ మాట్లాడిన తర్వాత.. రామ్ చరణ్ మాట్లాడనున్నారు. ఈయన తర్వాత దేశ ప్రధాని మోడీ స్పీచ్ ఉండబోతుంది.

దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాయి పెరిగిందని, ఆయన గ్లోబల్ స్టార అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు