Rakul Preet Singh: నా మొదటి సంపాదన ఇదే.. వారు లేకుంటే జీవితమే లేదు

మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా గిల్లి అనే కన్నడ సినిమాతో 2009లో మొదటిసారి వెండితెరపై మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో కెరటం అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి బ్రేక్ అందుకుంది.. ఆ తర్వాత తన టాలెంట్ తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కూడా నటించిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా నటిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.. రేపు అనగా ఫిబ్రవరి 21వ తేదీన గోవాలో తన ప్రియుడు , ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాత నటుడు అయినా జాకీ భగ్నానీ తో ఏడడుగులు వేయబోతోంది. ఈ క్రమంలోని ఆమె జర్నీని ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.

తన జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి సహాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేకపోతే సమస్యలు మరింత బాధను కలిగిస్తాయి అంటూ తెలిపింది.. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజు నుంచి నాకు 25 ఏళ్ల వయసు వచ్చేవరకు మా అమ్మ నాకు ఎప్పుడూ తోడుగానే నిలిచింది. నా కెరియర్ మోడలింగ్ తో ప్రారంభమైంది. అలా మొదట నేను అందుకున్న పారితోషకం రూ.5 వేలు. అక్కడినుండి ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి ప్రధాన కారణం మా తల్లిదండ్రులు.. సన్నిహితులు మాత్రమే.. నా వెంట వాళ్ళు లేకపోతే ఎన్నో సమస్యలు కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చేది.. అంటూ రకుల్ తెలిపింది.

రకుల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మేరీ పత్నీ కా రీమేక్, భారతీయుడు 2 సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈయన వివాహ విషయానికి వస్తే.. మొదట్లో లక్షద్వీప్ లో వివాహం చేసుకోవాలన్న వీరు కొన్ని కారణాల వల్ల గోవాకు తమ వివాహాన్ని మార్చుకున్నారు. అంతేకాదు తమ పెళ్లి అందరి పెళ్లిళ్ల కంటే భిన్నంగా ఉండాలని పర్యావరణ అనుకూలంగా వివాహాన్ని చేసుకుంటున్నారు.. క్రాకర్స్ ని కాల్చకుండా అలాగే వివాహ పత్రికలను కూడా ఇ-వెడ్డింగ్ కార్డ్స్ చేసి .. వీటి ద్వారా ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది.. అంతేకాదు అతిధులకు వారి ఆరోగ్య దృష్ట్యా విందు భోజనాలను దగ్గరుండి మరీ తయారు చేయిస్తున్నారట. మొత్తానికైతే రకుల్ – జాకీలా పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు