ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో అల్లు అర్జున్ స్టైల్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. తగ్గేదేలే అంటూ క్రికెటర్స్ నుంచి రాజకీయాల నాయకుల వరకు అందరూ ఫాలో అయ్యారు.
ఈ మూవీలో హీరోయిన్ గా రష్మీక నటించిన సంగతి తెలిసిందే. అయితే అమితాబ్ బచ్చన్ తో రష్మీక నటించిన గుడ్ బై అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రష్మిక మాట్లాడుతూ.. పుష్ప 2 షూట్ రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని వెల్లడించడం జరిగింది.
అమితాబ్, అల్లు అర్జున్ లతో కలిసి పని చేయడం ద్వారా తన కలను సాకారం చేసుకుంటున్నట్లు తెలిపింది. నటి బిగ్ బీ ని లెజెండ్ అని, అదేవిధంగా అందమైన వ్యక్తి అని కూడా పిలిచింది. గుడ్ బై సినిమాలో అమితాబ్ కూతురిగా నటిస్తోంది రష్మిక. ఈ చిత్రాలతో పాటు రష్మిక విజయ్ వరిసు, రణబీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగా యొక్క యానిమల్ చిత్రాల్లో మాత్రమే కాకుండా మిషన్ మజ్నులో కూడా ప్రధాన నటిగా నటిస్తుంది.