Pushpa 2: డబ్బింగ్ పనులు పూర్తి.. పోస్టర్ వైరల్..!

Pushpa 2..డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే.. ఈ సినిమాతో అల్లు అర్జున్ జాతీయస్థాయిలో అవార్డును కూడా అందుకున్నారు.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో పుష్ప-2 సినిమా పైన మరింత భారం పెరిగింది.. ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, లీకైన వీడియోలు, ఫోటోలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

బన్నీ పోస్టర్ వైరల్..
ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే విధంగా అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ ని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేపటి రోజున విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృంద ప్రకటించింది.. ఈ టీజర్ కోసం అందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.. అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ లో అంతా సిద్ధం అయిపోయింది అంటూ క్యాప్షన్ కూడా పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

డబ్బింగ్ పనులు పూర్తీ..
ముఖ్యంగా పుష్ప-2 చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు జరుగుతున్నట్టుగా అల్లు అర్జున్ ఈ ఫోటో షేర్ చేశారని అభిమానులు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ ఈసారి తన అద్భుతమైన నటనతో మరింత ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప-2 చిత్రాన్ని రిలీజ్ చేయడమే కాకుండా హై టెక్నికల్ క్వాలిటీస్ ను కూడా మరింత ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో పార్ట్-2 పై బీభత్సమైన అంచనాలు ఏర్పడుతున్నాయి.. మైత్రి మూవీస్ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

అంచనాలకు మించి..
ఇక అందరి అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని వినికిడి. పుష్ప మొదటి భాగం కంటే పుష్ప-2 మరింత ఆకట్టుకుంటుందని.. సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకున్న పోస్టర్ మాత్రం వైరల్ గా మారుతోంది.

అల్లు అర్జున్ సినిమాలు..
ప్రస్తుతం పుష్పటు సినిమా కూడా విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా అయిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.. అల్లు అర్జున్ మొదట గీత ఆర్ట్స్ బ్యానర్లో సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ త్రివిక్రంతో బన్నీ సినిమా చేయబోతున్నారని విషయం అయితే స్పష్టం అవుతోంది. ఈ సినిమా తర్వాత మరే డైరెక్టర్ కి అవకాశం ఇవ్వలేదు అల్లు అర్జున్ .. ఆ తర్వాత ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ కి అవకాశాలు ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి ఎవరితో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు