Puri Jagannadh : కొడుకును పక్కన పెట్టేశాడా ?

పూరి జగన్నాథ్ ఇటీవల తన కొడుకు ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని చాలా పెద్ద గొడవ చేశాడు నిర్మాత బండ్ల గణేష్. ఇతని కామెంట్స్ ను నిజంగానే చాలా మంది నెటిజన్లు సీరియస్ గా తీసుకుని పూరి పై మండిపడ్డారు. సరే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే.. నిజంగానే ఆకాష్ కెరీర్ విషయంలో పూరి అంత ఫోకస్ పెట్టడం లేదు అని వినికిడి. ప్రస్తుతం పూరి… విజయ్ దేవరకొండతో ‘లైగర్’ ‘జన గణ మన’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్తయ్యేవరకు పూరి మరో సినిమా చేసే వీలుండదు.

కానీ పూరి మాత్రం తన శిష్యులను దర్శకులుగా చేస్తూ తన వద్ద ఉన్న కథలను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కథని విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం కేటాయించాడని తెలుస్తుంది. పూరి, విజయ్, ఛార్మి కలిసి ఈ ప్రాజెక్టుని నిర్మిస్తారని.. దర్శకుడి పేరు కూడా త్వరలోనే ప్రకటిస్తారు అని తెలుస్తుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆంధ్రపోరి సినిమాతో హీరోగా మారిన ఆకాష్ మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ సినిమాలు చేసాడు, కానీ ఈ సినిమాలేవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని సాధించలేకపోయాయి. మరోవైపు పూరి, తన కొడుకు కెరీర్ ను పక్కన పెట్టి, తన హీరో తమ్ముడికి సినిమాని సెట్ చేయడం ఏంటి?’ అనే కామెంట్స్ పూరి పై ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు