Preity Zinta: సినిమాలకు దూరం కావడంపై క్లారిటీ ఇచ్చిన ప్రీతిజింటా..!

Preity Zinta.. ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారి.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా.. తెలుగు ప్రేక్షకులను తన అందంతో నటనతో మెస్మరైజ్ చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి బాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెలుగు పరిచయమైన ప్రీతీ.. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో కూడా నటించి మెప్పించింది.. అయితే ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వస్తున్నా.. బాలీవుడ్ పై వ్యామోహంతో తెలుగు తెరకు దూరమై బాలీవుడ్ కి చేరువయ్యింది. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ..

ఆరేళ్లు ఇండస్ట్రీకి దూరం..

Preity Zinta: Preity Zinta gave clarity on moving away from films..!
Preity Zinta: Preity Zinta gave clarity on moving away from films..!

అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ప్రీతి సినిమాని చేయడం లేదు.. దాదాపుగా ఆరు సంవత్సరాలుగా ఆమె ఏ సినీ ఇండస్ట్రీలో కూడా కనిపించకపోవడం గమనార్హం చివరిగా 2018లో ‘బ్రదర్ సూపర్ హిట్’ అనే చిత్రంలో మాత్రమే కనిపించింది. తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించని ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ కానుంది.. వచ్చే ఏడాది లాహోర్ 1947లో కనిపించబోతుందని సమాచారం. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఆరు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది..

అందుకే సినిమాలకు దూరం..

ప్రీతి జింటా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా నా సమయాన్ని వ్యాపారానికి కేటాయించాను.. నా కుటుంబ సభ్యులు కూడా తమకు సమయం ఇవ్వాలని కోరడంతో ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.. ముఖ్యంగా నాకు సినిమాలు చేయాలని లేదు..అందుకే వ్యాపారం పైన దృష్టి పెట్టాను.. ఇక నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకున్నాను.. హీరోయిన్స్ కి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని ప్రేక్షకులు మరిచిపోతారు.. అలాగే నేను ఏ నటుడితో లేదా పరిశ్రమలో ఎవరితో కూడా డేటింగ్ చేయలేదు.. నాకు నా కుటుంబం ఉంది. జీవితాన్ని వారితో గడపడం చాలా అద్భుతమైనది.. మీరు కూడా మీ జీవితాన్ని గడపడం మర్చిపోకూడదు.. పైగా నాకు ఒక బిడ్డ కావాలి.. అలాగే సినిమా అనేది ఎప్పటికీ ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. మొత్తానికైతే వ్యాపారం చేయడానికి అలాగే తన కుటుంబానికి తన తోడు అవసరమని అందుకే ఆరు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది ప్రీతి జింటా

- Advertisement -

లాహోర్ 1947 మూవీ..

అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మాణం అవుతున్న ఈ లాహోర్ 1947 సినిమా వచ్చే ఏడాది అంటే 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావచ్చు అని సమాచారం.. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించడంతోపాటు అమీర్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన అతిధి పాత్రలో కనిపించనున్నారట.. రాజకుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అలీ ఫజల్ , అభిమన్యు సింగ్, షబానా అజ్మీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు