Adhipurush: ప్రభాస్ కు అరుదైన వ్యాధి ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఉండరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. 40 ఏళ్ళు దాటినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. సాహూ, రాదే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కాస్త ఢిలపడిన ప్రభాస్.. ఇప్పుడు ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా భారీగా తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటించగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో తిరుపతిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి.. ఈ సినిమాకు పని చేసిన వారందరూ అతిథులుగా వచ్చారు. అయితే ఈ వేదిక నేపథ్యంలో… రెబల్ స్టార్ ప్రభాస్ స్టేజి పైన మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. అంతా ఓపెన్ ప్లేస్ అయినా… పెద్ద పెద్ద ఏసీలు ఉన్నప్పటికీ ప్రభాస్ కు భారీగా చెమటలు వచ్చాయి. దాంతో ఎక్కువసేపు మాట్లాడేందుకు కాస్త తడబడ్డాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ కు ఓ అరుదైన వ్యాధి ఉందని.. అందుకే అతనికి చాలా చెమటలు వచ్చాయని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం… దీనిపై కౌంటర్ ఇస్తున్నారు. ఎండాకాలం కాబట్టి చెమటలు అందరికీ రావడం చాలా సాధారణమని చెబుతున్నారు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు