Pawan Kalyan : వివేక్ ఆత్రేయకు మెగా ఆఫర్ ?

ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలీదు కానీ, పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భవదీయుడు భగత్ సింగ్ చేయడానికి కూడా ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇంకా సెట్స్ పైకి వెళ్ళకుండానే, వినోదయసీతం రీమేక్ ను లైన్ లో పెట్టేశాడు. ఈ మూవీలో మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనన్నారు.

ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకుండానే మరో ప్రాజెక్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే సుందరనికీ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చిన యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు పవన్ అవకాశం ఇచ్చడట. వివేక్ చెప్పిన కథ పవన్ కు బాగా నచ్చడంతో, వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే నిర్మాతలు ఎవరు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మైత్రి వారి నిర్మాణంలో వివేక్ ఆత్రేయ ఇంకో చిత్రం చేయాల్సి ఉంది. అయితే వాళ్ళు ఆల్రెడీ పవన్ – హరీష్ శంకర్ ల ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారు. మళ్లీ పవన్ వాళ్ళ తో మరో సినిమా చేస్తాడా లేక వేరే నిర్మాత పవన్ – వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు