Pawan Kalyan: భార్యతో కలిసి మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్పగానే ఒక తెలిని ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఇటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా అటు పాలిటిక్స్ ని కూడా సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మొదట సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నేరుగా రంగంలోకి దిగాడు పవన్. ఇక తాజాగా నేడు అనగా మే 13 వ తారీఖున ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన భార్యతో కలిసి మంగళగిరిలో సందడి చేశాడు. తన మూడవ భార్య అయిన అన్నా లేజినోవా తో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Pawan Kalyan exercised the right to vote in Mangalagiri with his wife
Pawan Kalyan exercised the right to vote in Mangalagiri with his wife

ఇక ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. నిన్నటి దాకా కూడా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ టోటల్ ఏపీ ని షేక్ చేశారు. ఇక నేడు ఆఖరి రోజు కావడంతో.. పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి తరలి వెళ్తున్నారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన భార్యను తీసుకుని పోలింగ్ దగ్గరికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుని మీడియాకి ఫొటోస్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు