Nandamuri Alekhya: ఎన్నికల వేల పార్టీ మార్చిన నందమూరి అలేఖ్య.. !

Nandamuri Alekhya: నందమూరి అలేఖ్య.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవ్వరూ గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ.. నందమూరి తారక రత్న భార్య అలేఖ్య అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ పేరుకు అంతటి ఫాలోయింగ్ ఉంది మరి. ఈయన సినీ ఇండస్ట్రీలో రాణించినప్పటికీ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక్కడ రాజకీయాల్లో కూడా ఈయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతకాలం రాజకీయం పరంగా బాగానే ఎదిగినప్పటికీ అనంతరం నుంచి ఈయనకి ఏది కూడా కలిసి రాలేదు.

ఆ తరువాత ఫ్యామిలీ తో విడిపోవడం.. ఇలా అనేక సమస్యలు చోటు చేసుకున్నాయి. ఇక ఆ బాధల్లో నుంచి తారకరత్న కోలుకోలేక .. 39 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఈయన ఫిబ్రవరి 18 2023లో ఆఖరి శ్వాస విడిచారు. దీంతో ఈయన కుటుంబం మొత్తం కృంగిపోయింది. ప్రస్తుతం తారకరత్న భార్య అలేఖ్య బాగోగులు, నందమూరి ఫ్యామిలీకి చెందిన బాలకృష్ణ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల బాలకృష్ణ అలేఖ్య ని కలిసి తమ మంచి చెడ్డలు అడిగాడు.

Nandamuri Alekhya changed the party for thousands of elections.
Nandamuri Alekhya changed the party for thousands of elections.

ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా అలేఖ్య తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేసింది. ఇక ఇదిలా ఉంటే అలేఖ్య మద్దతు ఎప్పుడూ టిడిపికే అని గతంలో ఓసారి మాట ఇచ్చింది. కానీ తాజాగా నేడు అనగా మే 13వ తారీకున ఎన్నికల హడావిడి జరుగుతూ ఉండగా పార్టీ మార్చేసింది. వైసిపి ఎమ్మెల్యే బుజ్జి బాబుతో ఫొటోస్ దిగుతూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాడు పార్టీ మార్చడం ఏంటి?.. అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు