Pawan Kalyan : హరీష్ శంకర్ కు 25 కోట్ల నష్టం ?

హరీస్ శంకర్, టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరు. గబ్బర్ సింగ్, దువ్వడా జగన్నాథం, గద్ధలకొండ గణేష్ లాంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు. అయితే ఈ దర్శకుడి నుండి గత మూడేళ్ల నుండి సినిమాలు రావడం లేదు. పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే చిత్రాన్ని ఓకే చేయించుకున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే చిత్రాన్ని మొదలు పెట్టడం, అది కంప్లీట్ అయి విడుదలవ్వడం కూడా జరిగిపోయింది. ‘భీమ్లా’ రిలీజ్ అయ్యి 4 నెలలు కావస్తున్నా హరీష్ శంకర్ ప్రాజెక్టును మొదలుపెట్టలేదు పవన్ కళ్యాణ్.

క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీర మల్లు’ తర్వాత హరీష్ శంకర్ సినిమా మొదలుపెడతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఫినిష్ అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. కానీ మరో పక్క ‘హరి హర వీర మల్లు’ ఫినిష్ అవ్వాలి. దానికి ఇంకా 3 నెలలు టైం పట్టేలా ఉంది. అంతేకాకుండా దసరా నుండి పొలిటికల్ టూర్ కు పవన్ రెడీ అయ్యాడు. దీనికి రెండు నెలల పాటు టైం పడుతుంది అని తెలుస్తుంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ వేరే ఆప్షన్ చూసుకోకపోతే కష్టం అని భావిస్తున్నట్టు వినికిడి.
పవన్ కోసం మూడేళ్లు వెయిట్ చేసినా హరీష్, ఏడాదికి ఒక్క సినిమా అనుకున్నా, ఈ 3 ఏళ్లలో 3 సినిమాలు ఫినిష్ చేసి ఉండేవాడు. ఒక్కో సినిమాకు రూ.9 కోట్ల వరకు పారితోషికం అందుకుంటాడు అని వినికిడి. ఆ రకంగా చూస్తే పవన్ వల్ల దాదాపు రూ.25 కోట్లు నష్టపోయినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు