vaishnav tej : మెగా మేనల్లుడి లైనప్ అదిరింది !

మెగా కంపౌండ్ నుండి ఇండస్ట్రీకి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్, తొలి సినిమా ఉప్పెనతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. డెబ్యూ హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డులు నమోదు చేశాడు. రెండో సినిమా ‘కొండపొలం’ మాత్రం కొంత వరకు నిరాశపర్చింది. ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా కాబట్టి, థియేట్రికల్ పెర్ఫార్మన్స్ గురించి మేకర్సే ఫీలవ్వలేదు. ఇక గిరీషయ్య దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘రంగ రంగ వైభవంగా’ చేస్తున్నాడు వైష్ణవ్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాతోనే వైష్ణవ్ కెరీర్లో మరో హిట్టు పడే అవకాశం ఉందని కూడా చిత్ర బృందం చెబుతోంది.

ఈ సినిమా విడుదల కాక ముందే, వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ మెగా మేనల్లుడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్న వైష్ణవ్, తాజా గా మరో ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ బ్యానర్లో వైష్ణవ్ సినిమా చేయబోతున్నాడట. ‘వరుడు కావలెను’ దర్శకురాలు సాయి సౌజన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇన్సైడ్ టాక్ ప్రకారం శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్నట్టు వినికిడి. మరి ఎవరు ఫైనల్ అయ్యారు అనేది, అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేము. ఏది ఏమైనా, యంగ్ హీరో వైష్ణవ్ లైనప్ మాత్రం అదిరిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు