NTR : మాటతో కదిలించాడు

ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తారక్ జీవితం పూల పాన్పు తో ప్రారంభం కాలేదు. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా గా ఎదిగాడు. 20 ఏళ్ల కెరీర్ లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ మంచిని కూడా కోరుకుంటాడు ఈ హీరో. ప్రతి సినిమా వేడుకలో రోడ్డు ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కు సూచిస్తాడు.

అయితే, ఇటీవల జనార్ధన్ ఎన్టీఆర్ వీరాభిమాని ప్రమాదానికి గురి అయ్యాడు. ప్రస్తుతం జనార్ధన్ కోమాలో ఉన్నాడు. ఈ విషయాన్ని తారక్ వరకు చేరవేశారు జనార్ధన స్నేహితులు. ఈ ప్రమాదంపై తారక్ వెంటనే స్పందించారు. జనార్ధన్ తో ఫోన్ మాట్లాడటానికి ప్రయత్నించాడు.

ఐసీయూలో ఉన్న జనార్ధాన్ వద్దకు డాక్టర్లు ఫోన్ తీసుకెళ్లి పెట్టాడంతో ఎన్టీఆర్ “జనార్దన్… జనార్దన్.. నేను ఎన్టీఆర్ ని మాట్లాడుతున్నాను. నువ్వు త్వరగా కోలుకొని వస్తే కలుద్దాం మనం. దేవుడి మీద భారం పెట్టు. దేవుడిని బలంగా నమ్ముకో. నువ్వు ఎంత త్వరగా కోలుకొని వస్తే అంత త్వరగా కలుద్దాం మనం. నిన్ను చూడాలని నాకు కూడా ఉంది. నేనున్నాను. అభిమానులు ఉన్నారు. నీకేం కాదు నువ్వు త్వరగా కోలుకుని వస్తావ్. రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ధైర్యం చెప్పాడు.
తారక్ మాటలు వినడంతో కోమాలో ఉన్న జనార్ధన్ చేతి వేళ్లు కదిపాడని డాక్టర్లు చెప్పుకొచ్చారు.

- Advertisement -

అనంతరం జనార్దన్ తల్లితో కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. “నా బిడ్డను కాపాడండి సర్. నువ్వంటే ప్రాణం అంటాడు. నువ్వంటే దేవుడంటాడు. నాకు ఒక్కగానొక్క కొడుకు. లేక లేక పుట్టాడు ” అంటూ ఎన్టీఆర్ తో జనార్ధన్ తల్లి వేడుకుంది. ఇందుకు ఎన్టీఆర్ “అమ్మా మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. మేమంతా ఉన్నాం. పైన భగవంతుడు ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి. అధైర్య పడొద్దు. జనార్దన్ త్వరగా కోలుకుని మన మధ్యకు వస్తాడు. మేమంతా ప్రార్థిస్తున్నాం. అభిమానులంతా ప్రార్థిస్తున్నారు. మేమంతా మీ వెంట ఉన్నాం” అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు ఎన్టీఆర్.
కాగా, ఫ్యాన్ కోసం తారక్ ఫోన్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన హీరో గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు