Ranga Maarthanda: కృష్ణ వంశీ చేయాల్సిన సినిమా కాదు

2017 లో వచ్చిన నక్షత్రం తర్వాత కృష్ణవంశీ నుండి మరో సినిమా రాలేదు. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో ఈయనతో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు. ఈ క్రమంలో అతను రంగ మార్తాండ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. మరాఠీ లో నాన పాటేకర్ నటించిన నట సామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఇప్పటివరకు కృష్ణవంశీ చేసిన ఒకే ఒక్క రీమేక్ సినిమా చంద్ర లేఖ కాగా ఇది రెండోది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, రమ్య కృష్ణ, అనసూయ వంటి స్టార్లు కూడా ఈ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్ట్ చేయాలి అనుకోలేదట. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని తన దర్శకత్వంలో రూపొందించాలి అనుకున్నాడట. కృష్ణవంశీ ని కథ, స్క్రీన్ ప్లే కోసం పనిచేయాలని మొదట కోరాడట. తర్వాత దర్శకత్వం చేస్తే నటన పై ఫోకస్ పెట్టలేడు అని భావించి కృష్ణ వంశీ నే డైరెక్ట్ చేయమని ప్రకాష్ రాజ్ కోరాడట. ఒరిజినల్ చూసినప్పుడు కృష్ణవంశీ కి 5 సార్లు కన్నీళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు తిరిగి ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు