Yash : రాఖీ క్రేజ్ పై దిల్ రాజు కన్ను

కేజీఎఫ్ సిరీస్ తర్వాత శాండిల్ వుడ్ లోని చిన్న హీరో యష్, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మాస్ పెర్ఫార్మన్స్ తో అన్ని భాషల్లోని, అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. యష్ కంటే ఎక్కువగా రాఖీ భాయ్ అనే పేరుతోనే అతను ఎక్కువ ఫేమస్ అయ్యాడు అంటే, ఆ పాత్రని ప్రేక్షకులు ఎంత బాగా ఓన్ చేసుకున్నారో స్పష్టమవుతుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం తెలుగు వెర్షన్ పరంగా 100 కోట్లకు పైగా షేర్ ను వసూళ్లు చేసింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఇన్ని కలెక్షన్లు రావడం అంటే మామూలు విషయం కాదు. కన్నడ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యష్.

అయితే ప్రశాంత్ నీల్ తప్ప కన్నడలో యష్ ఇమేజ్ కు తగ్గట్టు సినిమా తీసే దర్శకుడు లేడని చెప్పొచ్చు. ప్రభాస్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ – యష్ కాంబో లో కేజీఎఫ్ 3 వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమాను అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రశాంత్ నీల్ ఇప్పట్లో ఖాళీగా లేడు. సలార్ తర్వాత ఎన్టీఆర్ తో ఎన్టీఆర్31 చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాంచరణ్, అల్లు అర్జున్ తో పాటు పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

దీంతో రాఖీ భాయ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో చేతులు కలిపాడు. యష్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు ట్రై చేస్తున్నాడు. వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు దాదాపు సెట్ అయిపోయింది. అయితే, దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత రాఖీ, నార్తన్ అనే కన్నడ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు