Chaitanya-Kriti : నాగ చైతన్య-కృతి శెట్టి మరోసారి ?

కృతి శెట్టి 18 ఏళ్లకే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ‘ఉప్పెన’ తో ఇండస్ట్రీకి ఇచ్చిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ లతో హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలకు పెద్ద ఆప్షన్ గా మారిపోయింది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారియర్’ అనే ద్విభాషా చిత్రంలో బేబమ్మ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయినప్పటికీ, ప్రస్తుతం వస్తున్న ఆఫర్ లను కృతి వదులుకోవడం లేదు. అలా అని ఏ ప్రాజెక్టు పడితే ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆచి తూచి కొత్త సినిమాలకు సైన్ చేస్తుంది.

రామ్ సినిమా చేస్తుండగానే మరోసారి నాగ చైతన్య సరసన నటించేందుకు బేబమ్మ రెడీ అవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం పూజా హెగ్డే, శ్రీ లీలను సంప్రదించారు. కానీ, ఫైనల్ గా కృతి శెట్టి ఎంపికైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. చైతన్య- కృతి శెట్టి ఇప్పటికే ‘బంగార్రాజు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ జంట కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు