Puri-Charmme : పూరి-ఛార్మి లపై సెటైర్లు !

బండ్ల గణేష్ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మైక్ పట్టుకున్నాడు అంటే, స్పీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ అతిథిగా వచ్చాడు. వచ్చి స్టేజి ఎక్కి మైక్ పట్టుకున్న తన మార్క్ స్పీచ్ తో రచ్చ రచ్చ చేశాడు బండ్ల. ‘నేను ఈ ఫంక్షన్ కి వచ్చింది మా వదిన(పూరి భార్య లావణ్య) కోసం‘ అంటూ మొదలు పెట్టిన బండ్ల ‘పూరి గొప్ప డైరెక్టర్ అవుతాడు. భూమి బద్దలు కొడతాడు అని పూరి వెంట లావణ్య రాలేదు. జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి అని చెప్పినా, నమ్మి పూరీ జగన్నాథ్ వెంట వచ్చేసి సనత్ నగర్ గుడిలో పెళ్లి చేసుకుంది. అలాంటి గొప్ప తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ(పూరి) పై నీ కొడుకు(ఆకాష్) పై ఉంది. ఎన్నో ర్యాంప్ లు, వ్యాంప్ లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, అమ్మ శాశ్వతం (లావణ్య ని ఉద్దేశిస్తూ) అంటూ పూరి- ఛార్మీ ల పై పరోక్షంగా సెటైర్లు వేశాడు బండ్ల గణేష్.

అక్కడితో ఆగలేదు ‘ఎవరెవరినో స్టార్లను చేశావు, నీ కొడుకును మాత్రం స్టార్ ని చేయడానికి నీకు టైం లేదు. దేశమంతా కళ్ళాపు జల్లి ఆఖరికి తన ఇంటి ముందు జల్లుకోవడానికి టైం లేదు అన్నాడట ఒకడు. ఇది అలాగే ఉంది. నీ కొడుకు సినిమా ఫంక్షన్ కి రావడానికి నీకు టైం లేదా. ఇదే ప్లేస్ లో నా కొడుకు ఉంటే స్పెషల్ ఫ్లైట్ వేయించుకుని వచ్చేవాడిని. మనం పోతే తలకొరివి పెట్టాల్సింది వాళ్ళే. మనం పోతే మన అప్పులు తీర్చాల్సింది వాళ్ళే. వాళ్ళకంటే మనకు ఎవరు ఎక్కువన్నా’ అంటూ విరుచుకుపడ్డాడు బండ్ల. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు