Nayanatara : సరోగసి వెనుక అసలు నిజం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

Nayanatara : సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళం అంటూ పలు చిత్రాలలో నటించి అభిమానులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న నయనతార.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతోంది.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల వీరి ప్రేమాయణానికి ఏడడుగుల బంధంతో పులిస్టాప్ పెట్టారు అని చెప్పాలి. ఇక పెళ్లి జరిగిన ఆరు నెలల లోపే సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ జంట. ఇది ఇలా ఉండగా తాజాగా లేడీ సూపర్ స్టార్ పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..

నయనతార సరోగసి పై వేణు స్వామి కామెంట్స్..

తాజాగా వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి.. నయనతార సరోగసి ద్వారా పిల్లలు కనడం పై హాట్ బాంబు పేల్చారు.. నయనతార సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నయనతార పిల్లలను కనడం పై ప్రచారంలో ఉన్నది అంతా అవాస్తవం.. అసలు కథ వేరే అని తెలిపారు.. నయనతారకు అసలు సంతానయోగ్యమే లేదు అంటూ షాక్ ఇచ్చారు వేణు స్వామి.. ఆమెకు సంతానయోగం లేదు కాబట్టే సరోగసిని ఆశ్రయించిందని..ఆమె జాతకంలో ఆమెకు సంతానం లేదు అంటూ బాంబు పేల్చారు వేణు స్వామి.. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా నయనతార సరోగసి ద్వారా పిల్లలు కనడం పై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది .. పిల్లల్ని కంటే అందం పోతుందని.అందం పోతే సినిమాలలో అవకాశాలు రావని.. ఈ కారణంగానే తాను పిల్లల్ని కనలేదని.. అందుకే సరోగసిని ఆశ్రయించిందంటూ తెరపైకి కొన్ని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందేఅందుకే ఈమె సరోగసిని ఎంచుకుందనే వార్తలు కూడా వినిపించాయి.. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కొట్టి పారేస్తూ అసలు విషయాన్ని తేల్చి చెప్పారు వేణు స్వామి.

- Advertisement -

ఆ భాగ్యం లేదు కాబట్టే..

అంతేకాదు కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని , పిల్లలను కని మళ్ళీ ఫిట్నెస్ తెచ్చుకొని సినిమాలు చేస్తోంది కదా.. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్ళీ అంతే వేగంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది కదా.. మరి నయనతార అలా చేయడానికి సమస్య ఏంటి ? మిగిలిన చాలామంది హీరోయిన్లు ఇలా పిల్లల్ని కనీ..ఆ తర్వాత సినిమాలు చేయడం లేదా .? నయనతార ఏమో స్ట్రక్చర్ కోసం, ఫిజిక్ కోసం పిల్లల్ని కనలేదు అనే వార్త అయితే తెచ్చారు.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.. ఆమెకు సమస్య ఉంది దాని కారణంగానే ఆమె సరోగసిని ఆశ్రయించి.. పిల్లల్ని తన గర్భంలో మోయలేకపోయింది.. తనకు తల్లి అయ్యే భాగ్యం లేదు అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికైతే ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై నయనతార దంపతులు స్పందిస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు