Naga Chaitanya: పరశురామ్ ప్లానింగ్

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.ప్రస్తుతం నాగచైతన్య నుంచి ‘థ్యాంక్ యు’ అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత చైతూ ఏ సినిమా చేస్తారు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది.

ప్రస్తుతానికి అతను విక్రమ్ దర్శకత్వంలోనే ‘దూత’ అనే హార్రర్ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా అంటూ ఇంతకుముందు ప్రచారం జరిగింది. వెంకట్ తమిళంలో రూపొందించిన హిట్ మూవీ ‘మానాడు’నే వీళ్లిద్దరూ కలిసి రీమేక్ చేస్తున్నారని వార్తలు రావడం కూడా తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటిదాకా రాలేదు.

ఇకపోతే చైతూ, దర్శకుడు పరశురామ్ తో ఒక సినిమాను చెయ్యాల్సి ఉంది. పరశురామ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేసే అవకాశం రావడంతో ఎప్పుడో జరగాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరశురామ్ చై తో చేయబోయే సినిమాలో మరో యంగ్ నటుడు నవీన్ పోలిశెట్టి ను కూడా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు నవీన్. నిజంగానే వినిపిస్తున్న కథనాలు ప్రకారం వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే
అక్కినేని అభిమానులకు, ప్రేక్షకులకు కనుల పండుగ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు