Mahesh Babu : మహేష్ కోసం మైత్రీ తిప్పలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఇటలీకి వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ నుండి త్రివిక్రమ్ ను కలవడానికి మహేష్ జర్మనీ వెళ్ళారట. వీరి కాంబినేషన్లో ఓ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం లొకేషన్స్ ఫైనల్ చేసుకోవడం, తో పాటు తమన్ ను పిలిచి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేసేయాలనే ఆలోచనలో ఈ హీరో, దర్శకుడు ఉన్నారని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ‘మైత్రి’ వారు కూడా మహేష్ ను కలవడానికి జర్మనీ వెళ్లారట. ఎందుకంటే, మహేష్ ను తమ నిర్మాణ సంస్థతో మరో సారి నటించాలని ఒప్పించేందుకే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అందు కోసం అడ్వాన్స్ కూడా ఇవ్వాలని మైత్రీ నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో ప్రిన్స్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం రాజమౌళి స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తంది. ఒకవేళ రాజమౌళి స్క్రిప్ట్ ఇంకా లేట్ చేస్తే, ఈ గ్యాప్ లో మరో చిత్రాన్ని చేసేయాలని మహేష్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం గ్రహించిన ‘మైత్రి’ వారు మహేష్ కు రూ.50 కోట్ల పారితోషికం ఆఫర్ చేసి, కొంత అడ్వాన్స్ ఇచ్చి ఫిక్స్ చేసే ఆలోచనలో ఈ నిర్మాతలు జర్మనీకి వెళ్లినట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు