మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో 154వ చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటుంది. ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ సుకుమార్ దర్శనం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుంది.
ఇందులో బాబీ సినిమాకి సంబంధించిన అవుట్ పుట్ను సుకుమార్కి చూపిస్తున్నట్లు కనిపించాడు.
ఈ ఫొటోను బాబీ ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘మెగా 154 రషెస్ చూశాక సుకుమార్ ఫీలింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను’
మీరు మా సెట్ లో ఉండటం, అలానే మీరు ప్రేమతో చెప్పిన కొన్ని మాటలు మాకు మంచి బూస్టింగ్ అంటూ సుకుమార్ ను ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు బాబీ. “వాల్తేర్ వీరయ్య” మూవీలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ కి మంచి అనుబంధం ఉంది సుకుమార్ గత చిత్రాలు “రంగస్థలం”, “పుష్ప” సినిమాలే కాకుండా తన శిష్యుడైన బుచ్చిబాబు సానకి కూడా ఇదే బ్యానర్ లో “ఉప్పెన” సినిమా చేసే అవకాశం కల్పించాడు. మైత్రికి వరుస హిట్స్ ఇస్తున్న సుకుమార్, మైత్రి లో జరిగే సినిమాలు విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నారా అనే సందేహం కలుగుతుంది చాలామందికి.