Manjummel boys: Producers : మంజుమ్మెల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కి షాక్… అకౌంట్స్ అన్నీ సీజ్

Manjummel boys: Producers : తాజాగా విడుదలైన మాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ” మంజుమ్మెల్ బాయ్స్” మంచి హిట్ కొట్టడమే కాదు రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. కొడైకెనాల్ లోని గుణ గుహలలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లు వసూలు చేసింది.

పరవ ఫిలిమ్స్, శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేసిన ఈ చిత్రంలో సౌబిన్ షహీర్, బాలు వర్గీస్, శ్రీనాథ్ భాషి, దీపక్, లాల్ జూనియర్, గణపతి తదితరులు నటించారు. గుహలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ఓ యువకుడు చేసిన సహసమే ఈ సినిమా. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇలాంటి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నిర్మాతలకి ఇప్పుడు కేరళ కోర్టు షాక్ ఇచ్చింది.

మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని ఎర్నాకులం లోయర్ కోర్ట్ శనివారం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని ఆరూర్ కి చెందిన సిరాజ్ అనే వ్యక్తి తాను మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కోసం ఏడు కోట్లు ఖర్చు చేశానని.. కానీ నిర్మాతలు తనకు ఇప్పటివరకు పెట్టుబడి కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

సినిమా నిర్మించే సమయంలో నిర్మాతలు తనకు 40% లాభం వాటాగా ఇస్తామని మాట ఇచ్చారని.. కానీ ఇప్పుడు తను ఖర్చు చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో సబ్ కోర్ట్ జడ్జ్ సునీల్ ఈ సినిమా నిర్మాణ సంస్థ భాగస్వామి షాన్ ఆంటోనికి సంబంధించిన 40 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. అయితే కోర్టు తీర్పుపై నిర్మాతలు ఇప్పటివరకు స్పందించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు