Manchu Vishnu: మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..!!

Manchu Vishnu..టాలీవుడ్ లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.. 1993లో మొదలైన ఈ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిసారి కూడా ఎప్పుడు ప్రశాంతంగానే జరుగుతూ ఉండేవి.. కానీ 2019, 2021 ఎన్నికలు మాత్రం చాలా గొడవలతో జరిగాయి.. కానీ గత ఎన్నికలలో మంచు విష్ణు , ప్రకాష్ రాజు మధ్య గట్టి పోటీ జరిగింది.. అయితే ఈ పోటీ వీరిద్దరి మధ్య కాకుండా మంచు ఫ్యామిలీ , మెగా ఫ్యామిలీ అన్నట్టుగా ఎన్నికలు కొనసాగాయి.

మళ్లీ మా అధ్యక్షుడిగా విష్ణు..
దీంతో గత మా ఎన్నికలు సైతం అసెంబ్లీ ఎన్నికలను తలపించాయనే వార్తలు వినిపించాయి.. గొడవలు , ఆరోపణలతో పాటు నానా హంగామా చేశారు. ఆ ఎన్నికలు అంత రచ్చ మీద జరిగితే ఈ విడత ఎన్నికలు మాత్రం ఎటువంటి హడావిడి లేకుండా కేవలం ఏకగ్రీవంగా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది.. 26 మంది కమిటీ సభ్యులు కలిసి ఈసారి ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించినట్టుగా సమాచారం. దీంతో మరొకసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుని పదవికి అర్హుడని అప్పగించినట్లుగా తెలుస్తోంది.

మరో మూడు ఏళ్ల వరకు నో ఎన్నికలు..
అలాగే రఘుబాబు జనరల్ సెక్రెటరీగా , కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా.. మధుమిత, శైలజ ,జై వాణి ఈసీ మెంబర్స్ గా, శివ బాలాజీ ట్రెజర్ గా ఎంపికయ్యారు.. ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబర్స్ కూడా ప్రశంసలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో మరొకసారి అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక అయ్యారు.. అంతేకాదు మా అసోసియేషన్ నూతన భవనాన్ని నిర్మించే వరకు తానే అధ్యక్షుడిగా ఉంటానంటూ కూడా మంచు విష్ణు తీర్మానం చేయడం జరిగింది.. అంతేకాదు ఈసారి మూడేళ్ల వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) చరిత్రలో ఇదే మొదటిసారి..
ఒకవేళ ఇదే జరిగితే ఐదేళ్లపాటు మా అధ్యక్షుడిగా ఒకే ఒక్కడు కొనసాగడం మా చరిత్రలోనే ఇది మొదటిసారి అవుతుందని చెప్పవచ్చు.. అయితే ఈసారి ఈ ఎన్నికలలో కూడా ఏ ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సజావుగా సాగడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. మొత్తానికి అయితే మంచు విష్ణు మళ్ళీ మా అధ్యక్షుడిగా పదవి దక్కించుకోవడం పలువురు అభిమానులు , సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే మా నూతన భవనాన్ని నిర్మించే వరకు ఈయన అధ్యక్షుడు గానే కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మా అధ్యక్షుడిగా సినీ కార్మికుల కోసం హాస్పిటల్స్ , వృద్ధాప్య పింఛన్ , ప్రత్యేక భవనాలు వంటివి ప్రభుత్వంతో మాట్లాడి మరి ఏర్పాటు చేయించిన విష్ణు.. ఇప్పుడు నూతన భవనాన్ని కచ్చితంగా నిర్మిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టు అయినటువంటి కన్నప్ప సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తానే సొంతంగా భారీ బడ్జెట్లో కూడా నిర్మిస్తున్నారు. కన్నప్ప చిత్రం తమ కుటుంబానికి రీయంట్రీ గా ఉంటుందని భావిస్తున్నారు మంచు విష్ణు. ఇక ఈ సినిమాలో మంచు మోహన్ బాబు తో పాటు పలువురు సీనియర్ తారలు కూడా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు