Manchu Manoj : అసలైన విలనిజం చూస్తారు..!

Manchu Manoj.. మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన మంచు మనోజ్.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.. తాజాగా ఈ విషయాన్ని ఒక పిక్ రూపంలో షేర్ చేస్తూ ఆయనే వెల్లడించడం గమనార్హం.. మంచు మనోజ్ దాదాపు 7 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు.. వరుస పరాజయాలు, వ్యక్తిగత జీవితంలో డిస్టర్బెన్స్ కారణంగా సినిమాలు మానేశారు. ఇదిలా ఉండగా మరోవైపు గత ఏడాది అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకొని.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక రెడ్డితో.. వివాహమై విడాకులు తీసుకున్న మంచు మనోజ్ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.. ఈ ఏడాది భూమా మౌనిక రెడ్డి మరోసారి తల్లి అయింది.. మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని మనోజ్ తన కొడుకుగా స్వీకరించగా.. ఇప్పుడు వివాహం తర్వాత మళ్లీ ఆమె తల్లి అయింది.. ఇటీవలే కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం.

Manchu Manoj : You will see the original villainy..!
Manchu Manoj : You will see the original villainy..!

అసలైన విలనిజం చూస్తారు..

మొన్నా మధ్య ఉస్తాద్ అనే షో చేసిన ఈయన పెద్దగా సక్సెస్ కాలేదు. సెలబ్రిటీస్ టాక్ షో అయినప్పటికీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారు.. ఒక రకంగా ఈ సినిమా ఈయనకు రీఎంట్రీ అని చెప్పవచ్చు.. తాజాగా ఇదే విషయాన్ని ఆయన షేర్ చేస్తూ..” హార్ట్ హార్ట్ హాస్టిల్.. మళ్లీ సెట్ లోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది .. నేను ప్రేమించేదే ఇప్పుడు చేస్తున్నాను” అంటూ చేతులు కట్టుకొని నిలబడిన ఒక ఫోటోని షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తెలియజేశారు మంచు మనోజ్.. ముఖ్యంగా షూటింగ్ సెట్ నుంచి పంచుకున్న ఈ పిక్ అభిమానులకు ఆనందాన్ని కలగజేస్తోంది. ముఖ్యంగా మంచు మనోజ్ తాజాగా నటించబోయే సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా మంచు మనోజ్ మిరాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఇందులో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు హీరోగా చేసిన మనోజ్… ఈ సినిమాలో పూర్తీ విలన్ గా మారి తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. ఇక ఈయన తాజాగా మిరాయ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.. ఇక ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మిరాయ్ సినిమా విశేషాలు..

హనుమాన్ సినిమాతో ఈ ఏడాది భారీ పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.. ఈ సినిమా టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా.. ఆద్యంతం ఆకట్టుకుంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ సినిమాలో తేజ సజ్జా ను ఢీకొట్టే పాత్రలో విలన్ గా మనోజ్ కనిపిస్తున్నారని సమాచారం.. మంచు మనోజ్ చివరిగా ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019 సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.. ఇక ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత సెట్ లో కనిపించడం విశేషం. మరి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు