Mahesh Babu: ఆ దర్శకుడెవరు ?

మైత్రి మూవీ మేకర్స్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈ సంస్థ లో రెండు,మూడు సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ మంచి హిట్ అయి, అద్భుతమైన కలక్షన్స్ తీసుకొచ్చినవే. ఈ సంస్థలో సినిమాలు చేయాలని చాలామంది యువ దర్శకులు ప్రయత్నిస్తుంటారు . శ్రీమంతుడు సినిమాతో మొదలైన ఈ బ్యానర్ మొదటి హ్యాట్రిక్ హిట్స్ సాధించి ప్రతిష్ట్మాతకమైన స్థానాన్ని పొందుకుంది.

రీసెంట్ గా మహేష్ తో “సర్కారు వారి పాట” సినిమా చేసి మంచి కలక్షన్స్ రాబట్టిన ఈ బ్యానర్, మహేష్ బాబు 30వ సినిమాను నిర్మించే ప్రయత్నం చేస్తోందట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడిగా కొరటాల శివ, సుకుమార్ , సందీప్ రెడ్డి వంగ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ కెరియర్ కి శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన కొరటాల, మహేష్ 30 వ సినిమాను చేస్తే అది హ్యాట్రిక్ ఫిలిం అవుతుంది.

మహేష్ తో నేనొక్కడినే సినిమాను చేసారు సుకుమార్, ఆ సినిమా కమర్షియల్ గా అప్పుడు నిరాశపర్చిన ఇప్పుడు కొంతమంది దానిని క్లాసిక్ అంటూ పరిగణిస్తారు. ఇద్దరు కలిసి మళ్ళీ పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుని ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆ ప్రాజెక్ట్ కాస్త పక్కకెళ్ళిపోయింది. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.

- Advertisement -

సందీప్ రెడ్డి వంగ ఈ పేరు కంటే ఈయన తెరకెక్కించిన “అర్జున్ రెడ్డి” అనే సినిమా పేరు ఎక్కువ ఇంపాక్ట్ కలుగజేసింది ప్రేక్షకులకు. సినిమా రిలీజైనప్పుడు ఏ స్థాయిలో ప్రసంశలు వచ్చాయి అనేది వర్ణాతీతం, ఆ టైం లోనే మహేష్ బాబు సందీప్ ను పిలిచి సినిమా చేద్దాం అని చెప్పడం కూడా అందరికి తెలిసిన విషయమే, వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సరైన సినిమా పడి వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ కి బ్యాండ్ పడినట్లే.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న విషయం విదితమే, SSMB28 తరువాత రాజమౌళి తో సినిమా చేయనున్నారు మహేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు