SSMB28: మహేష్ సినిమాపై పవన్ సినిమాల ఎఫెక్ట్.. గురుజీ డబుల్ గేమ్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండి తెరపై కనిపించి దాదాపు ఏడాది అవుతుంది. చివరగా, సర్కారు వారి పాటతో మే12న సిల్వర్ స్క్రీన్ పై ప్రిన్స్ వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ తర్వాత సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మహేష్ తో ఇప్పటికే అతడు, ఖలేజ వంటి సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా వస్తుందంటే, అంచనాలు విపరీతంగా పెరిగాయి. కానీ, ఈ చిత్రం పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టింది.

కథ ఫైనల్ అవ్వడానికే నెలల సమయం గడిచింది. అంతా సెట్ అనుకున్న సందర్భంలో సూపర్ స్టార్ ఇంట్లో వరుసగా విషాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో మరోసారి వాయిదా పడింది. అనేక అడ్డంకుల తర్వాత SSMB28 స్టార్ట్ అయింది. కేజీఎఫ్ ఫైట్ మాస్టార్స్ తో యాక్షన్ సీక్వెన్స్ చేశారు. కానీ, అవి మహేష్ కు పెద్దగా నచ్చలేదు. దీంతో చేసిన సీన్స్ అన్నింటినీ కూడా రద్దు చేసి, మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. ఇటీవల శ్రీలీలతో ఒక షాపింగ్ మాల్ లో కొన్ని సీన్స్ చేశారు. ఈ సన్నివేశాలు త్రివిక్రమ్ కు నచ్చలేదట. దీంతో మహేష్ షూట్ ను ఆపేసి.. విదేశాలకు వెళ్లాడు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కు మహేష్ ఓ క్లారిటీ ఇచ్చారట. ఇలా చేసిన సీన్స్ రద్దు చేయడం కాకుండా, పక్క ప్రణాళికతో రావాలని, మళ్లీ ఇలా జరగకుండా చూడాలని సలహా ఇచ్చారట. దానికి త్రివిక్రమ్ కు కొంత సమయాన్ని కూడా మహేష్ ఇచ్చారని సమాచారం. వేసవి తగ్గిన తర్వాత SSMB28 షూట్ స్టార్ట్ చేద్దామని త్రివిక్రమ్ కు మహేష్ సూచించారని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

దీంతో మహేష్ ఫ్యాన్స్.. త్రివిక్రమ్ పై సీరియస్ అవుతున్నారు. త్రివిక్రమ్.. మహేష్ తో సినిమా చేస్తున్నా.. తన ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ చేస్తున్న వినోదయ సీతం తెలుగు రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG లపైనే ఉందని ఆరోపిస్తున్నారు. అందువల్లే SSMB28 షూటింగ్ ఆలస్యం అవుతుందని, చేసిన సీన్స్ ను తొలగించాల్సి వస్తుందని మండిపడుతున్నారు. త్రివిక్రమ్ పక్క సినిమాల కంటే, తన సినిమాలపై ఫోకస్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు