విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా గతేడాది రిలీజై, ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పడటంతో విజయ్ కెరీర్ ప్లాన్స్ అన్నిటిలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పాలి.
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ పై నమ్మకంతో లైగర్ సినిమా రిలీజ్ కి ముందే ఆయన దర్శకత్వంలో జనగణమన సినిమా స్టార్ట్ కూడా చేసారు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఆ తరువాత లైగర్ సినిమా రిలీజై , డిజాస్టర్ టాక్ రావడంతో ఒక్కసారిగా అంత మారిపోయింది. దాంతో ఇంకా రిస్క్ చేయకూడదు అనుకున్న విజయ్ దేవరకొండ జనగణమన సినిమాని మధ్యలోనే ఆపేసాడు. ఆ తరువాత నిన్ను కోరి సినిమా ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా కమిట్ అయ్యాడు.
మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ ఖుషి సినిమా షూటింగ్ తొందర తొందరగా ఫినిష్ చేసి, లైగర్ ఫ్లాప్ ని ఫ్యాన్స్ మర్చిపోయేలా చేయాలనుకున్నాడు విజయ్, కానీ ఈ సినిమా సమంత ఆరోగ్య పరిస్థితుల కారణంగా మధ్యలోనే షూటింగ్ ఆగిపోయింది. దాంతో విజయ్ కొత్త సినిమా కమిట్ అవ్వలేక, ఉన్న సినిమాని రిలీజ్ లేక అయోమయంలో పడిపోయాడు.
అయితే ఈ మధ్యనే మళ్ళీ సమంత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో మళ్లీ ఖుషి సినిమా షూట్ మొదలైంది. ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసిందని సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించి ఇంకా కేవలం అయిదు రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉందని టాక్. జులై మొదటి వారంలో ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ ని కాకినాడ లో చిత్రీకరించనున్నారట. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ 1న సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఖుషి సినిమా షూటింగ్ అయిపోతుందన్న వార్త వినగానే విజయ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News