యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రం ఏప్రిల్ 14న విడుదలై ఇప్పటికీ ఏదో ఒక రికార్డుని క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా బాహుబలి2 రికార్డుని బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ ద్వారా అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 2 కి ‘బుక్ మై షో’ లో 17.1 మిలియన్ టికెట్లు సోల్డ్ అయ్యాయట. అంతకు ముందు ఈ రికార్డ్ ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ పేరుతో ఉండేది.ఓ కన్నడ సినిమా ఈ ఫీట్ ను సాధిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.
కరోనా కారణంగా ఇళ్లల్లోనే ఉంటూ ఓటిటిలకి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన ఘనత ఈ సినిమాకి దక్కింది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లనే ఈ మూవీ అధిగమించింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇప్పటివరకు రూ. 1231.39 కోట్ల గ్రా వసూళ్లను కొల్లగొట్టినట్టు సమాచారం. ‘కేజీఎఫ్’ తో హీరో యశ్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్నారు. బాలీవుడ్లో అయితే ఈ మూవీ దెబ్బకి అక్కడి రీజనల్ మూవీస్ చాలా వాయిదా పడ్డాయి. విడుదలైన సినిమాలు కూడా ఈ మూవీ ముందు నిలబడలేకపోయాయి.