Keerthy Suresh : బిగ్ ప్రాజెక్ట్ రిజక్ట్

కీర్తి సురేష్, సీనియర్ హీరోయిన్ మేనక కూతురుగా ఇండస్ట్రీకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో అదే పేరుతో అవకాశాలు వచ్చాయి. కానీ, కొద్ది రోజుల్లోనే తమిళ, తెలుగు భాషల్లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో అగ్ర దర్శకుడు మణిరత్నం కంట పడింది. సావిత్రి బయోపిక్ “మహానటి” సినిమాలో అవకాశం వచ్చింది.

నిజానికి మణిరత్నం సినిమాలో కనీసం ఒక్క సారైనా కనిపించాలని చిన్న స్థాయి నుండి స్టార్ హీరో హీరోయిన్లు వరకు అందరూ కోరుకుంటారు. లక్కీగా, కొద్ది సినిమాలు చేసిన కీర్తి సురేష్ కు “మహానాటి” అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు జాతీయ అవార్డ్ వచ్చింది. అలాగే, తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్ అయిపోయింది. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఎదిగింది.

అయితే, ఈ ఫేమ్ పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. “మహానటి” తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపు ప్లాప్ అయ్యాయి. కొన్ని హిట్ అయినా, కీర్తికి మాత్రం పేరు రాలేదు. ఈ క్రమంలో కీర్తి ఓ బిగ్ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

మణిరత్నం దర్శకత్వంలో “పొన్నియన్ సెల్వన్” అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష చేస్తున్న పాత్ర కోసం కీర్తి సురేష్ ను మణిరత్నం సంప్రదించారట. కానీ, డేట్స్ ఖాళీగా లేవు అనే కారణం చెప్పి రిజక్ట్ చేసిందట. హిట్స్ లేని సమయంలో మణిరత్నం లాంటి అగ్ర దర్శకుడు అవకాశం ఇస్తే, రిజక్ట్ చేయడమేంటి అని ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కీర్తి సురేష్ ఈ పాత్ర చేసి ఉంటే, మరోసారి స్టార్ ఇమేజ్ వచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ సినిమాలో చియన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, తో పాటు త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని వీరి లుక్స్ లను కూడా మేకర్స్ విడుదల చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు