Karthikeya 2 Trailer : అంచనాలను పెంచేసింది

ఈ మధ్య సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే చాలు అదే తరహా పాత్రల్లో సీక్వెల్స్ లోనూ కంటిన్యూ అవుతూ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతుంటారు. ఈ తరహాలో వస్తున్న మరో చిత్రం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన “కార్తికేయ 2”. సూపర్ హిట్ “కార్తికేయ” చిత్రానికి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా నటిస్తూంది. అలాగే శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘5118 ఏళ్ల క్రితం నాటి యుగాంతం సమయంలో ఒక అద్భుతమైన జ్ఞాన సంపద కనుమరుగు అవుతుంది. దానిని ఈ యుగంలో కొందరు చేజిక్కించుకోవడానికి చేసే అన్వేషణ’ అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

చివరికి ఆగస్టు 13న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, మొదటి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుండి రెండో ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. మాస్ మహారాజ రవితేజ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. “ఐదు సంవత్సరాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం” అంటూ ట్రైలర్లో చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.

ద్వారకలోని శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి వెళ్ళిన హీరో నిఖిల్, శ్రీకృష్ణుని సన్నిధి లో సంభవించిన ఓ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేది ఈ ట్రయిలర్ లో చూపించారు. “నా వరకు రానంత వరకే అది సమస్య.. నా వరకు వచ్చాక అది పరిష్కారం” అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ సినిమా పై క్యూరియాసిటీ పెంచేసాయి. ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆగస్ట్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు