Karan Johar : “టాలీవుడ్ లో విజయ్ స్పెషల్”

టాలీవుడ్లో దిల్ రాజు లానే.. బాలీవుడ్లో కరణ్ జోహార్ ఓ స్టార్ ప్రొడ్యూసర్. అలాగే అతను దర్శకుడు కూడా. మన ‘బాహుబలి’ ని అక్కడి ప్రేక్షకులకు అందించింది అతనే. ఆ సినిమాకి అతను చేసిన పబ్లిసిటీ కూడా ట్రెండింగ్లో నిలిచింది. టాలీవుడ్ హీరోలైన ప్రభాస్, రానా, ఎన్టీఆర్, చరణ్ వంటి వాళ్ళతో ఇతనికి మంచి సాన్నిహిత్యం ఉంది.

అయితే ఇతని 50వ పుట్టినరోజు వేడుకకి టాలీవుడ్ నుండీ కేవలం విజయ్ దేవరకొండనే ఆహ్వానించాడు కరణ్. ముంబైలోని తన సొంత నివాసంలో మే 25న పెద్ద పార్టీని ఏర్పాటు చేశాడు కరణ్. ఈ వేడుకకి టాలీవుడ్ హీరోల్లో ఒక్క విజయ్ దేవరకొండకి మాత్రమే ఆహ్వానం వెళ్ళడం పై చర్చలు మొదలయ్యాయి.

విజయ్ తో పాటు ‘లైగర్’ టీం సభ్యులు అయిన పూరి జగన్నాథ్, ఛార్మీ లు కూడా హాజరయ్యారు. రష్మిక, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలను ఆహ్వానించకుండా కేవలం విజయ్ ను మాత్రమే కరణ్ ఆహ్వానించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ కు ఇతను కో ప్రొడ్యూసర్. పైగా టాలీవుడ్ హీరోలు అయిన ప్రభాస్, చరణ్ లు బాలీవుడ్లో ఫేమస్ అయ్యాక కరణ్ తో సినిమాలు చేయడానికి నిరాకరించారట. ఈ లిస్ట్ లో రానా కూడా ఉన్నాడు. ఆ కోపంతోనే టాలీవుడ్ హీరోలను కరణ్ ఆహ్వానించి ఉండకపోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు