Kamal Haasan : ఫ్యాన్స్ కు సారీ చెప్పిన కమల్ హాసన్..!

కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్‌’ చిత్రం వచ్చే నెల 3వ తారీఖున విడుదల కాబోతుంది. ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఈ మూవీలో విజయ్‌సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ , సూర్య వంటి స్టార్ హీరోలు కూడా నటించారు. అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.’రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌’ పతాకం పై స్వయంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇదిలా ఉండగా…. తాజాగా కమల్ హాసన్ తన అభిమానులకి క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

కమల్ హాసన్ విక్రమ్ ప్రమోషన్లలో మాట్లాడుతూ… “నా సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతుంది.ఇంతలా వెయిట్ చేయించినందుకు … నా అభిమానులు నన్ను క్షమించాలి. నేను సంపాదించింది తిరిగి సినీ పరిశ్రమలోనే పెడుతున్నాను, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడతాను. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన ‘విక్రమ్‌’ మూవీ రిలీజ్ అవ్వడం యాదృచ్ఛికం.

కానీ నాకు ఆయన ఇష్టమైన నాయకుడు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కి సీక్వెల్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ నుండీ ‘విశ్వరూపం2’ (2018) తర్వాత మరో సినిమా రాలేదు. శంకర్ దర్శకత్వంలో ‘ఇండియా2’ మొదలైనా కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు