Jhanvi Kapoor: నాకు కొంచం సిగ్గు.. నా పెళ్లి అలానే జరగాలి..!

Jhanvi Kapoor: వరసత్వంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జాన్వీ కపూర్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇక బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకి కాలం కలిసి రాక దక్షిణాదిలో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర, రామ్ చరణ్ 16 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక జాన్వి కపూర్ కి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టినరోజు, పండుగలు, పర్వదినాలు ఇలా ప్రతి సందర్భంలో ఆమెకి ఏడుకొండలవాడిని దర్శించుకోవడం చాలా ఇష్టం. ఆమె ఇప్పటికే సుమారు 50 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. జాన్వి చాలా కాలంగా షికర్ బషీర్ తో ప్రేమలో ఉంటుంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వీరి ప్రేమను జాన్వి కపూర్ తండ్రి, నిర్మాత బోనికపూర్ కూడా అంగీకరించారు.

అయితే తాజాగా తన పెళ్లి ఎలా జరగాలని అనేదాని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జాన్వి. తన పెళ్లి తిరుమలలో సాంప్రదాయబద్దంగా జరగాలని కోరుకుంటున్నానని తెలిపింది. ” నా పెళ్ళిలో నేను కాంచీపురం పట్టు చీర ధరించి, మల్లెపూలు పెట్టుకోవాలని ఉంది. నాకు కాబోయే భర్త కూడా పంచె కట్టుకోవాలి. అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం వడ్డించాలి. నా వివాహాన్ని వేడుకలా జరుపుకోవడం నాకు ఇష్టమే.. కానీ నాకు కొంచెం సిగ్గు. కాబట్టి కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తాను. ఎక్కువమంది వస్తే నన్నే చూస్తూ ఉంటారు. దీంతో నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నా కుటుంబం, సన్నిహిత మిత్ర బృందం ఉంటే చాలు” అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు