Indian National Crush: దడక్ -2 లో నేషనల్ క్రష్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్..!

Indian National Crush.. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదొక ట్రెండ్ లాగా మారిపోయింది.. ఇప్పటికే కొన్ని మూవీలు విడుదల కాకముందే రెండవ పార్ట్ ఉంటుందని ప్రకటించగా మరికొన్ని ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత సీక్వెల్స్ ప్రకటిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ఏడాది వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ , ప్రాజెక్ట్ల విషయానికొస్తే.. పుష్ప, సలార్, దేవర , ఇండియన్ 2, వార్ 2 చిత్రాలు ఉన్నాయని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది 2016లో మరాఠీ నుంచి బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న చిత్రం సైరట్.

ధడక్ -2 ప్రకటించిన ధర్మ ప్రొడక్షన్స్..

Indian National Crush: National crush in Dadak-2.. unit given clarity..!
Indian National Crush: National crush in Dadak-2.. unit given clarity..!

ఒక్క మరాఠీ లోనే రూ.100 కోట్ల వరకు వసూల్లను రాబట్టిన ఈ చిత్రం.. అప్పట్లో రికార్డు సృష్టించింది. ఇక ఇదే సినిమాని బాలీవుడ్లో ధడక్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా ఇషాన్ ఖట్టర్ హీరో గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ సినిమా హిందీలో మంచి విజయం సొంతం చేసుకుంది. లేకపోతే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించింది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ స్థాపించిన ఈ ధర్మ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.

ధడక్ -2 నేషనల్ క్రష్ త్రిప్తి..

ధర్మ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సారధ్యంలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, యానిమల్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలో ధడక్ 2 సినిమా తెరకెక్కబోతోంది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి ఇందులో అవకాశం దక్కించుకోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్ , ధర్మ ప్రొడక్షన్స్ మరియు క్లౌడ్ 9 పిక్చర్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా ను అనౌన్స్మెంట్ చేస్తూ తాజాగా మేకర్స్ ప్రకటించారు .. ఈ అనౌన్స్మెంట్ వీడియోలో ఒకప్పుడు ఒక రాజు, ఒక రాణి ఉండేవారు.. వారు వేరు వేరు కులాలకు చెందినవారు.. వారి కథ ముగిసింది అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో వీడియో సాగింది. ఇక 2024 నవంబర్ 22వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది.. రెండు వేరువేరు కులాల వారు.. పేద, ధనిక అనే స్థాయిల మధ్య ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

నేషనల్ క్రష్ కోసం..

సినిమా కథ కథనం విషయం పక్కన పెడితే.. ఇందులో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి నటిస్తోందని తెలిసి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే యానిమల్ సినిమాలో శృంగారభరిత పాత్రలలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకోవడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి హీరోయిన్ గా త్రిప్తి ఎలా తనను తాను ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు