IND vs Pak T20 World Cup : అమితాబ్ అప్సెట్ అయ్యారట… మధ్యలోనే టీవీ ఆఫ్ చేసానంటూ పోస్ట్

IND vs Pak T20 World Cup : భారతదేశం vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాయాది దేశం ఇండియా చేతిలో ఓడిపోయింది అంటే ఇండియన్స్ సంబరాలు అంబారాన్ని తాకుతాయి. ఆదివారం కూడా అలాంటిదే జరిగింది. టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఇండియన్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం అప్సెట్ అయ్యాను. మధ్యలోనే టీవి ఆఫ్ చేశాను అంటూ పోస్ట్ చేశారు.

అమితాబ్ అప్సెట్ అయ్యారా ?

ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా విజయం సాధించడంతో పాక్‌ వైఫల్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది. పాక్‌కు 120 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విజయంపై భారతీయులే కాదు సెలబ్రిటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆనందాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

అమితాబ్ బచ్చన్ ఒక చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, ‘T 5037(i) – హే బాప్ రే బాప్! ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూస్తున్నాను. కానీ మధ్యలో టీవీని స్విచ్ ఆఫ్ చేసాను. ఎందుకంటే మనం ఓడిపోతున్నాం అనుకున్నాను. హఠాత్తుగా ఇంటర్నెట్ చూసి గెలిచాం, గెలిచాం, గెలిచాం!!! ఇండియా ఇండియా ఇండియా ఇండియా ఇండియా ఇండియా ఇండియా…’ అంటూ బిగ్ బి సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Imageప్రీతి జింటా పోస్ట్

అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు, నటి ప్రీతి జింటా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘వావ్ వాట్ ఎ మ్యాచ్… వాట్ ఎ రీ బ్యాక్ అండ్ వాట్ ఫైట్… 119 పరుగులతో ఆదుకున్న భారత క్రికెట్ జట్టుకు పూర్తి మార్కులు…’ అంతేకాదు శక్తివంతమైన ఇన్నింగ్స్ చేసినందుకు ప్రత్యేకంగా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ట్యాగ్ చేసింది.

ధనుష్ పోస్ట్

ధనుష్ ట్విట్టర్ పోస్ట్‌లో నిన్నటి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నైపుణ్యాలను హైలైట్ చేసి “బుమ్రా యు బ్యూటీ” అని రాసుకొచ్చాడు. మెరుస్తున్న కళ్లతో కూడిన ఎమోజీలతో పాటు లవ్ సింబల్ తో తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘వాట్ ఎ విన్… ఇండియన్ టీమ్… నిజానికి #హ్యాపీసండే’ అని పోస్ట్ చేశారు. నటి శ్రద్ధా కపూర్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ‘నేను కూడా 2-3 వికెట్లు తీసినంత ఆనందంగా ఉంది’ అని అన్నారు. విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్, సన్నీ హిందూజా, ఇషాన్ ఖట్టర్, శ్రద్ధా కపూర్, కునాల్ ఖేము, బాబీ డియోల్, సంజయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్‌లు భారత్ విజయం సాధించిన తర్వాత సంబరాలు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు