NTR30: ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ చేరుకున్న హీరోయిన్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం NTR30. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. హైదరాబాద్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. జాన్వీ కపూర్ కి ఇది తెలుగులో మొదటి సినిమా. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆ తర్వాత జాన్వీ ముంబై వెళ్లి పోయింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూట్ ఎన్టీఆర్‌తో మాత్రమే జరిగింది. ఇప్పుడు, జాన్వీ కపూర్ తన షూటింగ్ కోసం వస్తూ ఆదివారం హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించింది. ఆమె విమానాశ్రయం గుండా వెళుతున్నప్పుడు, సెల్ఫీలను క్లిక్ చేయడానికి అభిమానులు తన చుట్టూ గుమిగూడారు. లైట్ బ్రౌన్ కలర్ డ్రెస్ తో వైట్ టి షర్ట్ లో ఆమె తన మొహం మేకప్ లేకుండా ఉంది.

RRR తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా పగడ్బందీ గా తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటుల వివరాలు ఇంకా చెప్పలేదు కానీ, సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 లో విడుదల అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు