Nani : నాని ని ఏపి ప్రభుత్వం మళ్ళీ టార్గెట్ చేస్తుందా?

టికెట్ రేట్ల ఇష్యూ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు నాని కూడా ఏపి ప్రభుత్వానికి విలన్ అయిపోయాడు. అందుకే అతని శ్యామ్ సింగ రాయ్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను ఏదో ఒక వంక పెట్టి సీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు 100 థియేటర్ల వరకు సీజ్ చేసింది. థియేటర్లో కంటే కూడా పక్కన ఉన్న కిరాణా కొట్లో కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి అంటూ నాని చేసిన కామెంట్ కు అంత రచ్చ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లు జగన్ ను కలిసి టికెట్ రేట్ల ఇష్యూని సాల్వ్ చేసినట్టు కనిపించినా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను మాత్రం ఏపి ప్రభుత్వం టార్గెట్ చేసింది.

ఇప్పుడు నాని సినిమాకు కూడా అలాంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నాని నటించిన అంటే సుందరానికి? మూవీ జూన్ 10న విడుదల కాబోతుంది.ఆ మూవీకి టికెట్ రేట్లు తగ్గించే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు భారీగా పెరిగిపోయాయి అంటూ సమన్యుల్లో నిరాశ ఎదురైంది. దీనిని చూపించి నాని సినిమాని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు