Guntur Kaaram : టీంకు గ్రాండ్ పార్టీ… మహేష్ ఈ మూవీ టాక్ తో హ్యాపీగానే ఉన్నాడా?

Guntur Kaaram : సినిమా హిట్ అయినప్పుడల్లా పార్టీలు ఇవ్వడం మహేష్ బాబుకు ఆనవాయితీగా మారింది. “గుంటూరు కారం” సినిమాకు కూడా దాన్నే ఫాలో అయ్యారు. “గుంటూరు కారం” టీంకు మహేష్ బాబు ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ మూవీ టాక్ తో మహేష్ హ్యాపీగానే ఉన్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచే తీవ్రమైన నెగిటివిటి వచ్చింది. మిక్స్డ్ రివ్యూస్ రావడంతో యావరేజ్ బొమ్మ అంటూ ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ మూవీ ఆక్యుపెన్సి కాస్త బెటర్ అయ్యింది.

తెలంగాణలోని అనేక ప్రాంతాలలో, అలాగే ఆంధ్రాలోనూ నెమ్మదిగా సినిమాకు కుటుంబ ప్రేక్షకుల నుంచి సపోర్ట్ పెరుగుతోంది. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో కేవలం మహేష్ బాబు కటౌట్ కోసం ఫ్యామిలీతో కలిసి “గుంటూరు కారం” సినిమాను చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు ఆడియన్స్. మహేష్ బాబు ఇమేజ్ మాత్రమే ఈ సినిమాను నిలబెట్టిందని విమర్శకులు అంటుంటే, నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. దాని ఫలితంగానే “గుంటూరు కారం” మూవీ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 136 కోట్లు. ఈ మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే మరో వారంలోపు “గుంటూరు కారం” బయ్యర్లకు 75% కంటే ఎక్కువ రికవరీ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

నిజానికి ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ “గుంటూరు కారం” సినిమాను కాపాడింది. “గుంటూరు కారం” తాజా బాక్స్ ఆఫీస్ లెక్కలు, అలాగే ఈ మూవీకి నెగిటివ్ టాక్ తగ్గిపోయి నెమ్మదిగా యావరేజ్ టాక్ రావడం పట్ల మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సంక్రాంతి సందర్భంగా “గుంటూరు కారం” టీంకు స్పెషల్ పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీకి మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ తో పాటు, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ నాగ వంశీ, హీరోయిన్లు శ్రీలీల మీనాక్షి చౌదరి తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు ఆయన భార్యతో పాటు హాజరు కాగా, శిరీష్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. మహేష్ బాబు రేపు ఈ సినిమా కోసం పని చేసిన ఇతర సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు పార్టీ ఇవ్వబోతున్నారని సమాచారం. మొత్తానికి “గుంటూరు కారం” సినిమాతో మహేష్ బాబు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు