బాలీవుడ్ మొత్తం కొద్ది రోజుల నుంచి సౌత్ హీరోలు, డైరెక్టర్స్ మీదనే ఆధారపడుతుంది. బీ టౌన్ డైరెక్టర్స్ స్టోరీలను అక్కడి ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి సౌత్ సినిమాలపై హిందీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర దర్శకులు, హీరోలు హిందీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రాణించడంలో విఫలం అవుతున్నారు. నార్త్ లో ఇటీవల చెప్పుకోదగ్గ సినిమా వచ్చిందంటే.. అది ‘ది కశ్మీర్ ఫైల్స్’ మాత్రమే.
ది కశ్మీర్ ఫైల్స్ తర్వాత.. బాలీవుడ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఈ రోజు విడుదల అయిన షాహిద్ కపూర్ జెర్సీ. ప్రీమయర్ షోల నుంచే జెర్సీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ లో సూపర్ హిట్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ లో జెర్సీ హిట్ కన్ఫామ్ అని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగ తెలుగులో గౌతమ్ తిన్ననూరి 2019 తెరకెక్కించిన సినిమా జెర్సీ. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా.. కెరీర్ లోనే మంచి హైప్ తెచ్చింది.
ఈ సినిమానే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశారు. అల్లు ఎంటర్టైన్మెంట్, దిల్ రాజ్ ప్రొడక్షన్స్, సీతార ఎంటర్టైన్మెంట్స్, బార్క్ ఫిల్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే తెలుగు డైరెక్టర్ గౌతమ్.. జెర్సీ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. బాలీవుడ్ లో మరోసారి సౌత్ డైరెక్టర్ సంచలనం సృష్టించాడని సినీ క్రిటిక్స్ అంటున్నారు. రాబోయే రోజుల్లో బీ టౌన్ ను సౌత్ హీరోలు, డైరెక్టర్స్ ఏలేయడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.