Gopichand : ‘భీమా’ ప్రమోషన్లు షురూ!

టాలీవుడ్ మాస్ హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో నటిస్తున్న “భీమా” సినిమా మార్చి8న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినపుడే ఈ బీమాపై ఓ రేంజ్ హైప్ పెరిగిందన్న మాట వాస్తవం. ఈ సినిమా టీజర్ చూసాక వింటేజ్ గోపీచంద్ ని ఒక్కసారిగా చూసినట్టనిపించింది. గోపీచంద్ కటౌట్ కితగ్గ రోల్ మళ్ళీ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు.

పైగా గోపిచంద్ ఇంతకు ముందు పోలీస్ గా నటించిన సినిమాలన్నీ హిట్టే. ఇక మళ్ళీ తనకచ్చోచిన రోల్ లో నటిస్తుండడం బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే రిలీజ్ కి మూడు వారాలు మాత్రమే టైం ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. రీసెంట్ గా పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. తాజాగా గోపీచంద్ సహా జనాల మధ్యకు వచ్చి ప్రమోట్ చేయడం ఉత్తమం అని భావించారు. తాజాగా విజయవాడ కనకదుర్గమ్మని దర్శించిన గోపీచంద్ సహా చిత్ర యూనిట్ అక్కడి నుండే తమ ప్రమోషన్లను స్టార్ట్ చేయడం ప్రారంభించారు.

విజయవాడ దర్శనం పూర్తయ్యాక అటు నుండి గుంటూరుకి వెళ్లి అక్కడ RVR & JC ఇంజినీరింగ్ కాలేజీ లో తమ భీమా సినిమాను ప్రమోట్ చేయనున్నారు. ఆ తర్వాత మరో రెండు రోజుల తర్వాత వరంగల్ లో కూడా తమ సినిమా ప్రమోషన్ కి బయల్దేరనున్నట్టు సమాచారం. ఇక భీమా సినిమాకు కెజిఎఫ్ ఫేమ్ రవి బాసూర్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. కాగా దాదాపు 20 కోట్లకి పైగా భీమా బిజినెస్ జరుగుతుందని టాక్.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు