Gautham Vasudev Menon: దారి మార్చాడు

గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రేమ అనే కావ్యాన్ని వెండితెర అనే కాగితం పై అద్భుతంగా రాయగలడు. ప్రస్తుతం ఈ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ “వెందు తనింధతు కాదు” అనే తమిళ్ మూవీను చేస్తున్నాడు. శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సిద్ధి ఇద్నాని మరియు కయదు లోహర్ మరియు నీరజ్ మాధవ్ కూడా నటిస్తున్నారు. గౌతమ్ గతంలో శింబుతో విన్నైతాండి వరువాయా, అచ్చం యేంబడు మడమైయాడా సినిమాలను, తెలుగులో నాగ చైతన్య హీరోగా ఏమాయ చేసావే , సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలుగా తెరకెక్కించాడు.

అయితే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం తన దారి మార్చాడు
శింబు నటించిన “వెందు తనింధతు కాదు” సినిమాను తెలుగులో నాగ చైతన్యతో కాకుండా రామ్ పోతినేని హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా గౌతమ్ మీనన్ తో రామ్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు “వెందు తనింధతు కాదు” సినిమానే రీమేక్ చేయబోతున్నట్లు వినికిడి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో వారియర్ సినిమాను చేస్తున్నారు.
గౌతమ్ తమిళ్ లో చేసిన “వెందు తనింధతు కాదు” చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు