Varun Tej: అదిరిపోయే కథ.. ఆ కాంబో సెట్‌ అయినట్లేనా?

సాయి పల్లవి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అందం, నటన, అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఈ అమ్మడు ఎంతోమంది అభిమానుల మనసులను కొల్లగొట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషచిత్రాల్లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది.

 

 

- Advertisement -

ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన జతకట్టే అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా కొనసాగుతోంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. అంతకుముందు డి డాన్స్ ప్రోగ్రాం ద్వారా పరిచయమైన సాయి పల్లవి… ఫిదా సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా చేయగా సాయి పల్లవి హీరోయిన్గా మెరిసింది. 2017 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

 

ప్రస్తుతం సాయి పల్లవి మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ కాంబోలో ఓ కొత్త సినిమా రాబోతుందట. ఆ సినిమా ఫిదాకు సీక్వెల్ అని సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకున్నారట. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఫిదా సినిమా ఎన్నో వసూళ్లను రాబట్టింది. మరి ఈ ముగ్గురు కలిసి ఫిదా సీక్వెల్ చేస్తారా…? లేక సాయి పల్లవి స్థానంలో మరొక హీరోయిన్ ను తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు