Tharun Bhascker: ఈ నగరానికి ఏమైంది పార్ట్ -2 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం,వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలలో నటించిన ఈనగరానికి ఏమైంది సినిమాకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో ఉన్న దర్శకులలో ఒక యూనిక్ టేస్ట్ ఉన్న అతికొద్ది మంది దర్శకులలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

 

అయితే ఈ సినిమా రిలీజప్పుడు థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. అప్పుడున్న పరిస్థితుల వల్లనో , లేక రాంగ్ టైం రిలీజ్ వల్లనో తెలీదు గాని రిలీజప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ సినిమా ఓటిటిలోకి వచ్చినప్పటి నుంచి మాత్రం ఈ సినిమాకి వివరితమైన క్రేజ్ వచ్చింది. సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడున్న యూత్ అందరికి బాగా కనెక్ట్ అవడంతో ఈ సినిమాకి మంచి రికాగ్నేషన్ లభించింది.

- Advertisement -

ఇటీవలనే ఈ సినిమా రిలీజ్ అయిన ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా రీ- రిలీజ్ చేయగా, రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ తో అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ షో లతో మంచి స్పందన లభించింది. ఒరిజినల్ రిలీజ్ కంటే కూడా రీరిలీజ్ కె ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది రీ- రిలీజ్ కు థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దామని వెళ్లి రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాడు, ప్రేక్షకులతో ఆయన మాట్లాడుతూ సినిమా పార్ట్ టూ ను తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్తాను అని చెప్పాడు. గతంలో కూడా ఈ సినిమాని పార్ట్ 2 తీయమని ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉంది. కానీ దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని తరుణ్ భాస్కర్ ఇటీవలనే పార్ట్ 2 ను కన్ఫామ్ చేయడంతో యూత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు