RAPO: డబుల్ ఇస్మార్ట్ కి బడ్జెట్ త్రిబుల్ అంట- ఫ్లాప్ అయితే పూరి పరిస్థితి ఏంటో ?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే పూరి జగన్నాథ్ టైం అస్సలు బాగా లేదు అనిపిస్తుంది. ఈమధ్య కాలంలో ఆయన చేస్తున్న అన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజవుతూ, బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయి. దాంతో పూరి కెరీర్ అగమ్యగోచరంగా మారిపోయింది.

ఎన్నో ఆశలు పెట్టుకొని, భారీ బడ్జెట్ పెట్టి తీసిన లైగర్ ఫ్లాప్, పూరి జగన్నాథ్ ను ఈ రోజుకు కూడా వెంటాడుతూనే ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ డిమాండ్ ఉండగా, మొదటి రోజు నుంచే సినిమాకునెగిటివ్ టాక్ రావడంతో, బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన పూరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుత్తం ఆయన యంగ్ హీరో రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాకు పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నాడు. వరుస ఫ్లాప్ సినిమాలతో పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని సతమవుతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వీరిద్దరూ చాలా కాలం తరువాత హిట్ అందుకున్నారు. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 75 కోట్ల వరకు వసూలు చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

- Advertisement -

అయితే తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమాకె పార్ట్ 2 తీసి మళ్ళీ హిట్ కొట్టాలనే ఆలోచనలో పూరి ఉన్నట్టు తెల్సుతుంది. అయితే ఈ సినిమాని కూడా పాన్ ఇండియాలో లెవెల్ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే మరీ దీనికి బడ్జెట్ కూడా ఆ రేంజ్ లోనే పెట్టబోతున్నారట. ఇస్మార్ట్ శంకర్ బడ్జెట్ కు త్రీ టైమ్స్ ఎక్కువ మొత్తంలో ఈ ప్రాజెక్ట్ కు ఖర్చు పెట్టబోతున్నట్టు సమాచారం. సినిమా హిట్ అయితే సమస్య ఏమి లేదు గాని ఫ్లాప్ అయితే మాత్రం పూరి జగన్నాథ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి అందటం లేదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు