Divya bharti..అతి చిన్న వయసులోనే టాలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ దివ్యభారతి.. 17 సంవత్సరాలకే అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ.. 19 సంవత్సరాల వయసులోనే మరణించింది.. ఈమె మరణం అప్పుడు అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. దివ్యభారతి ముంబైలో ఒక అపార్ట్మెంట్లో 5వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మరణించింది. అప్పట్లో దివ్యభారతి మరణం పైన పలు రకాల అనుమానాలు కూడా ఎక్కువగా వినిపించాయి.
దివ్యభారతి క్రేజ్ చూసి తట్టుకోలేక..
ముఖ్యంగా దివ్యభారతి క్రేజ్ చూసి తట్టుకోలేక.. ఆమె మరణించాలని ఎవరో కావాలనే పైనుంచి తోసేసారని కూడా కొంతమంది వాదించారు.. అయితే ఇప్పటికి దివ్యభారతి మరణం ఇండస్ట్రీలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ దివ్యభారతి మృతి పైన బాలీవుడ్ నటుడు కమల్ సదానా పలు విషయాలను వెల్లడించారు.. దివ్యభారతి మరణం కేవలం ప్రమాదమే అంటూ తెలియజేశారు. సంఘటన జరగడానికి మూడు రోజుల ముందు ఒక సినిమా షూటింగ్ లో ఆమెతో కలిసి వర్క్ చేశానని కమల్ తెలియజేశారు. అలాగే తన జీవితంలో జరిగిన ఘటనల గురించి దివ్యభారతి మరణం గురించి మరిన్ని విషయాలు వెల్లడించారు.
దివ్యభారతి మరణం పై బాలీవుడ్ హీరో కామెంట్స్
కమల్ సదాన్ మాట్లాడుతూ.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న దివ్యభారతి మరణం అందరికీ చాలా కఠినమైన విషయంగా అనిపించింది.. ఆమె మరణం అందరిని చాలా బాధ పెట్టింది. అత్యంత ప్రతిభావంతురాలైన నటీమణుల్లో దివ్యభారతి కూడా ఒకరని.. దివ్యభారతి సినిమా షూటింగ్ సమయాలలో చాలా సరదా సరదాగానే గడిపేదని.. కానీ ఆమె మరణ వార్త విని ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయ్యిందని వెల్లడించారు. అయితే ఆమె మరణానికి ముందు మూడు రోజులు కలిసి పని చేశాను దివ్యభారతి మరణించిన సమయంలో ఆమె చేతిలో చాలా చిత్రాలే ఉన్నాయని తెలిపారు.
ఆ డ్రింక్స్ వల్లే..
ఆ సినిమాలన్నీ చేసి ఉంటే దివ్యభారతి తిరుగులేని స్టార్డం అందుకునేదని.. దివ్యభారతి మరణం కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందని వెల్లడించారు కమల్.. తనకు తెలిసిన మేరకు ఆమె కొన్ని డ్రింక్స్ తాగడం వల్లే అలా జరిగిందని వెల్లడించారు.. అలా డ్రింక్స్ తాగుతున్న సమయంలో తిరుగుతూ చాలా సరదాగా ఉందని.. అయితే అనుకోకుండా బాల్కనీ నుంచి కింద పడిపోయింది..అది కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందంటూ వెల్లడించారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆమె చేయవలసిన సినిమాలు చాలానే ఉన్నాయని తెలియజేశారు కమల్.
దివ్యభారతి వ్యక్తిగత జీవితం..
దివ్యభారతి బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ను ప్రేమించిన ఈమె 1992 మే 10న వివాహం చేసుకుంది. అయితే ఈమె మరణం తర్వాత సాజిద్ చాలాకాలం మళ్ళీ వివాహం చేసుకోకుండా దివ్యభారతి తండ్రి వద్దే ఉండేవారు.. భార్యను అమితంగా ప్రేమించిన ఈయన ఆమె మరణం తర్వాత ఆమె తండ్రి తోనే ఎక్కువ కాలం నివసించారు.. కానీ ఆయన కూడా మరణించడంతో సాజిద్ ఆ తర్వాత మరో వివాహం చేసుకున్నారు.