Dil Raju Productions: దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఐదుగురు కొత్త డైరెక్టర్స్

Dil Raju Productions: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఒకటి. దిల్ అనే సినిమాతో మొదలైన ఈ బ్యానర్ ఇప్పటికీ 50 సినిమాలు పైగా పూర్తి చేసుకుంది. ఈ బ్యానర్లో దిల్ రాజు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఈ బ్యానర్ కి మంచి సక్సెస్ రేట్ ఉంది. ఈ బ్యానర్ కి ఇంత సక్సెస్ రేట్ కావడానికి కారణం దిల్ రాజు జడ్జిమెంట్. ఒక సినిమాను దిల్ రాజు నమ్మాడు అంటే ఆ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అలానే దర్శకుడికి మంచి ఫ్రీడమ్ ఇస్తారు అందుకని ఈ బ్యానర్లో గొప్ప సినిమాలు వచ్చాయి.

దిల్ రాజు పరిచయం చేసిన డైరెక్టర్లు

దిల్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు సుకుమార్. అయితే ఈ సినిమా జరుగుతున్న తరుణంలోని దిల్ రాజుకి ఒక మాంటేజ్ షాట్ ను చెప్పారు. ఆ మాంటేజ్ దిల్ రాజ్ కి విపరీతంగా నచ్చి నా బ్యానర్ లో నెక్స్ట్ దర్శకుడు నువ్వే అంటూ సుకుమార్ మాటిచ్చారు. ఆ తర్వాత ఆ బ్యానర్లో ఆర్య అనే సినిమాతో దర్శకుడుగా మారాడు సుకుమార్. ఇదే సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ శ్రీకాంత్ అడ్డాల అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా కొత్త బంగారులోకం అనే సినిమాతో శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు సినిమాతో భాస్కర్ దర్శకులుగా మారారు. ఇలా చాలామంది దర్శకులను దిల్ రాజు పరిచయం చేశారు.

Dil Raju

- Advertisement -

దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా అదే మాదిరిగా

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్లో బలగం సినిమాతో వేణు దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బలగం సినిమా చాలామంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో రోజుల తర్వాత కూడా ఈ సినిమాను విలేజ్లో తెరపై వేసుకొని కూడా చూసిన ఆడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం మీ బ్యానర్లు లవ్ మీ అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ ట్రైలర్ లంచ్ ఈవెంట్ ను రీసెంట్ గా జరిపారు. ఈ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మొత్తం ఐదుగురు కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు.

ఐదుగురు కొత్త డైరెక్టర్స్

అయితే ప్రస్తుతం లవ్ మీ అనే సినిమాతో ఒక కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఆ తర్వాత ఆకాశం దాటి వస్తావా అనే సినిమాతో శశి కుమార్ అనే దర్శకుడు పరిచయం కాదు కాబోతున్నాడు. శతమానం భవతి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే ఒక సినిమా రాబోతుంది ఈ సినిమాతో హరి అనే ఒక దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. రాజావారు రాణి గారు అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన రవికిరణ్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమాను చేయండి అన్నట్లు రీసెంట్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దర్శకులను పరిచయం చేసినట్లు ఈ బ్యానర్ లో కూడా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు