Chaitanya jonnalagadda: పవన్ కు ఓటేయ్యొద్దు.. మెగా ఫ్యామిలీ మొత్తం చీటర్స్.!

Chaitanya jonnalagadda.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అటు కూటమి ఇటు వైసిపి ఎవరికి వారు ప్రచారాలు నిర్వహిస్తూ.. అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా సినీ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈయనకి మద్దతుగా నిలవాలి అంటూ పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెట్టడమే కాదు నేరుగా పిఠాపురం వెళ్లి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మాజీ భర్త, మెగా అల్లుడు జొన్నలగడ్డ చైతన్య మాత్రం ఇందుకు విరుద్ధంగా కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది..

Chaitanya jonnalagadda: Don't vote for Pawan.. The entire Mega Family is a cheaters..!
Chaitanya jonnalagadda: Don’t vote for Pawan.. The entire Mega Family is a cheaters..!

పవన్ కళ్యాణ్ కి ఓటు వేయొద్దు..

పవన్ కళ్యాణ్ కి ఓటు వేయొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చైతన్య జొన్నలగడ్డ.. ఆయన మాట్లాడుతూ ..జనసేన పార్టీకి ఎవరు ఓటు వేయకండి.
స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుంది.. ముఖ్యంగా జనసేన కోసం ఏర్పాటుచేసిన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ పాటించడు.. ఇక ఆయన మాట్లాడే మాటలకు , చేసే చేష్టలకు అస్సలు పొంతన ఉండదు.. నిజానికి పవన్ కళ్యాణ్ తరఫున ఎంతోమంది సెలబ్రిటీలు పిఠాపురంలో ప్రచారాలు చేస్తున్నారు కానీ అదంతా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కాదు ఆయనంటే భయంతోనే.. దానికి కారణం ప్రచారానికి రాకపోతే అవకాశాలు రావని. ఆర్టిస్టులను పవన్ కళ్యాణ్ భయపెట్టడంతో ప్రచారానికి వస్తున్నారని.. జనసేనను నమ్మి ఎంతోమంది మోసపోయారు.. మీరు కూడా అలా గుడ్డిగా పవన్ కళ్యాణ్ కు ఓటు వేయకండి.. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లు వింటున్నాడు అంటూ చైతన్య జొన్నలగడ్డ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చైతన్య మెగా ఫ్యామిలీ గురించి చేసిన కామెంట్లకు మెగా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

నిహారికతో విడిపోయిన చైతన్య జొన్నలగడ్డ..

ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు నిర్మాత అయిన నాగబాబు తన కూతురు నిహారికను చైతన్య జొన్నలగడ్డకు ఇచ్చి 2020 రాజస్థాన్లోని ఉదయపూర్ విలాస్ లో చాలా ఘనంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే.. అయితే వీరి దాంపత్య బంధం మాత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చైతన్య , నిహారిక ఒకరికొకరు విభేదించుకోవడం మొదలుపెట్టారు.. ఇక తర్వాత 2023 లో విడాకులు తీసుకొని విడిపోయారు.. అప్పటినుంచి నిహారిక సినిమాలోకి రీ యంట్రి ఇచ్చి నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తెరకెక్కిస్తోంది.. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక చైతన్య జొన్నలగడ్డ మాత్రం పూర్తిగా మెడిటేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. దేవస్థానాలు తిరుగుతూ మనశ్శాంతి వెతుక్కుంటున్నట్లు సమాచారం. అంతేకాదు కొన్ని ఉత్పత్తులకు ఈయన మోడల్గా కూడా వ్యవహరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు