BoyapatiRapo: మైసూర్ షెడ్యూల్ కంప్లీట్.. నెక్స్ట్ ఎక్కడ?

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తీస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ముందే చెప్పేసారు బోయపాటి శ్రీను. పూర్తిగా బోయపాటి స్టైల్ లో మాస్ మసాలా సినిమా గా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గితే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా భారీ లెవెల్లో తీస్తున్నారు. ఇక ఈ చిత్ర యూనిట్ జూన్ 6న తమ షూటింగ్ పార్ట్ ని మైసూర్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ షూట్ లో కిన్ని యాక్షన్ ఎపిసోడ్లతో పాటు హీరో, హీరోయిన్ల మధ్య ఒక పాటను కూడా చిత్రీకరించారు.

తాజాగా బోయపాటి శ్రీను ఈ సినిమా యొక్క మైసూర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని ట్వీట్ వేసాడు. అందులో భాగంగా తన చిత్ర యూనిట్ కి అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాడు. రీసెంట్ గా శ్రీ లీల బర్త్ డే సందర్బంగా తన బర్త్ డే పోస్టర్ ని కూడా వదిలారు. ఇప్పటికే 80 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ వివరాలు ఇంకా చెప్పలేదు. అయితే తదుపరి షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటుందని, రామానాయుడు స్టూడియో లో పలు యాక్షన్ సన్నివేశాలు తీయొచ్చని చిత్ర ట్రేడ్ పండితుల సమాచారం.

ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను అక్టోబర్20 న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు